Telugu Rekha Media - జిల్లా వార్తలు / నంద్యాల/ఆళ్లగడ్డ : ఆళ్లగడ్డలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించి లైసెన్సులు లేనిపలు హోటల్ యాజమాన్యాలకునోటీసులు జారీ చేశారు. మంగళవారం ఆళ్లగడ్డ పట్టణంలో పలు హోటళ్లపై తనిఖీలు నిర్వహించి ఆహార పరిరక్షణ నాణ్యత ప్రమాణాల లైసెన్స్ లో తీసుకొని హోటల్ యాజమాన్యాలపై నోటీసులు ఇచ్చారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటరాముడు కాసింవలిలు. ఆహార పదార్థాలపై కచ్చితంగా మూతలు ఉంచి పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలన్నారు.బ్రాండెడ్ పప్పు దినుసులు, మంచి నూనెలను మాత్రమే ఆహార పదార్థాల్లో వాడాలన్నారు. ప్రకృతి సిద్ధమైన రంగులే వాడాలి ఆహార పదార్థాల్లో టెస్టింగ్ సాల్ట్ వాడకూడదు రోజు వాడే ఉప్పునే వాడాలి కానీ ఈ నిబంధనలను బిరియాని సెంటర్లు, హోటల్ యాజమాన్యాలు కచ్చితంగా పాటించాలని అన్నారు. నిబంధనల ప్రకారం అన్ని రకాల భోజన శాలల్లో లోపలి భాగం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. డ్రైనేజీ వసతి బాగుండాలి .వంట ఉండే వ్యక్తుల ఆరోగ్యానికి సంబంధించిన హోటల్ యజమాని డాక్టర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. అనంతరంబిరియాని సెంటర్లు, నాలుగు రోడ్ల కూడలి లో ఉన్న చికెన్ రొట్టె గుడ్డు హోటళ్లపై తనిఖీలు నిర్వహించి ఆహార పదార్థాలను పరిశీలించారు. ఆహార పదార్థాలలో రసాయన కలర్స్ వాడితే వారి లైసెన్స్ లో రద్దు చేసి వారి పైన కేసులు నమోదు చేస్తామన్నారు పలు హోటలలో ఆహారాన్ని శాంపిల్ గా తీసి ల్యాబ్ కు పంపిస్తామన్నారు . భోజన పదార్థాలు, టిపన్ల తయారీకి నాసిరకం సరుకులు కూరగాయలు వాడితే కఠిన చర్యలు మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రీజ్ లో ఉంచి మరుసటి రోజు విక్రయించరాదని హోటల్ యాజమాన్యాలకు సూచించారు. హోటల్ వ్యాపారాలు చేయాలంటే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి లైసెన్స్ లేకపోతే తనిఖీల్లో దొరికినప్పుడు సెక్షన్ 63 ప్రకారం ఫుడ్ సేఫ్టీ కమిషన్ ద్వారా క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తామన్నారు 5 లక్షల రూపాయలు ఉన్నాయని ఈ సందర్భంగా వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంకట రాముడు, ఖాసిం వలి, ఫుడ్ సేఫ్టీసిబ్బంది తదితరులు ఉన్నారు.
Reporter
Telugu Rekha Media