Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ లోని పంచశీల కాలనీలోని నివాసంలో ఆమె ఉరి వేసుకున్నారు. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, రూపాదేవి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఆమె రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదని సమాచారం రమాదేవి ఆత్మహత్య విషయం అర్ధరాత్రి బయటకు వచ్చింది. ఆత్మహత్యకు ముందు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు భార్య వీడియో కాల్ చేసారు. బుధవారం అల్వాల్ నుంచి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండికి వెళ్లగా, సాయంత్రం ఆయనకు రూపాదేవి వీడియో కాల్ చేసి చనిపోతున్నానని చెప్పారు. మేడిపల్లి సత్యం ఇంటికి చేరుకునేలోపే ఆమె ఆత్మహత్య చేసుకోగా, విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి సత్యం బోరున విలపించారు. రూపాదేవి మృతదేహానికి పోస్టు మార్టం పూర్తి అయింది. తరువాత పంచశీల కాలనీకి మృతదేహాన్ని తరలించారు. మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ వెంటవున్నారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ రుపాదేవి మృతి దురదృష్టకరం ఒక గంటలోపల అంతిమ సంస్కార కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు.. డైరీ ఫార్మ్ రోడ్డు సమీపంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుపనున్నట్లు వెల్లడించారు..
Reporter
Telugu Rekha Media