Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణపై కలెక్టర్ ఆగ్రహం విద్యార్థుల పట్ల బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
శనివారం రోజున మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను కలెక్టర్ పరిశీలించారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన విద్యార్థి మృతి చెందిన ఘటనపై ఆయన విద్యార్థులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల అస్వస్థతపై సమగ్ర విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. జరిగిన ఘటనపై పూర్తి నివేదికను వెంటనే సమర్పించాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలోని తరగతి గదులకు కిటికీలు లేకపోవడం, పారిశుద్యం సరిగా లేక పోవడం మరుగుదొడ్ల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో పాఠశాల ఉపాధ్యాయులతో పాటు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై విచారణ చేసి, ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాధ్యతరాహిత్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు...కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media