Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : బడ్జెట్ లో మహిళా లోకం పై చిన్నచూపు ఇచ్చిన గ్యారంటీలు గాలికి వదిలి మహిళలకు అన్యాయం చేసారని -బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు మొండిచేయి ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.శుక్రవారం తెలుగుతల్లి ఫ్లైఓవర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నానిర్వహించారు. సందర్బంగా ప్రభుత్వం దిష్టి బొమ్మను దగ్ధం చేసారు. ఈ సందర్బంగా శిల్పా రెడ్డి మాట్లాడుతూ మహిళలకు 4 వేల పెన్షన్ ఎప్పటినుండి ఇస్తారో చెప్పలేదు ప్రస్తావనకు రాని ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తామన్నారు,విద్యార్థినులకు ఇస్తానన్న స్కూటీ ల ఊసే లేదు..అడ్రస్ లేని విద్యార్థినులకు 5 లక్షల భరోసా కార్డు ఉఉసే లేదన్నారు.ఎన్నికల ముందు 6 గ్యారంటీల పేరుతో మహిళలకు హామీలు ఇచ్చిన సోనియా, ప్రియాంక గాంధీ లు సమాధానం చెప్పుతారా లేక ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు సమాధానం చెప్పుతారా అని శిల్పా రెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్ లో తెలంగాణ మహిళలకు తీరని అన్యాయం చేసారని. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు.
Reporter
Telugu Rekha Media