Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 2 లక్షల రూపాయల లోపు రైతు రుణమాఫీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 0 నుండి 1 లక్ష 50 వేల రూపాయల వరకు పంట రుణాలు ఉన్న రైతు కుటుంబాలకు రుణమాఫీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రొజెక్టర్ ద్వారా ప్రజాప్రతినిధులు వ్యవసాయ అధికారులు బ్యాంకర్లు మరియు రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో 0 నుండి 1 లక్ష 50 వేల రూపాయల వరకు ఋణం గల రైతు కుటుంబాలు పొందిన రైతు రుణమాఫీ చెక్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 279 కోట్ల 33 లక్షల 31968 రైతు రుణమాఫీని 27955 రైతు కుటుంబాలకు చేయడం జరిగిందని లక్ష రూపాయల లోపు ఋణ మాఫీ చేసినట్టే ఈ సారి కూడా రైతులకు బ్యాంకుల నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ రుణమాఫీ నిధులను బ్యాంకులనుండి తీసుకోవచ్చని తెలిపారు. రుణమాఫీ ప్రక్రియ సాఫీగా జరిగింది ఇప్పటికే బ్యాంకర్లకు మరియు వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఏమైనా సమస్య వస్తే పరిష్కరించాడానికి వ్యవసాయ క్లస్టర్ స్తాయి నుండి ఏఇఓ, మండల వ్యవసాయ అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్ లు మరియు జిల్లా వ్యవసాయ అధికారి అందుబాటులో ఉంటారని వారిని సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలని రైతులకు చూసించారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ప్రభాకర్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ హరి, వ్యవసాయ, సహకార శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media