Tuesday, 28 July 2026 04:33:30 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

పేద ప్రజల ఆశాజ్యోతి.. బండి...

-- ఘనంగా కేంద్రమంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలు రోగులకు పండ్లు , రక్తదానం చేసిన బిజెపి కార్యకర్తలు.

Date : 11 July 2024 07:04 PM

Telugu Rekha Media - తెలంగాణ / కరీంనగర్ : హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి భీమదేవరపల్లి , సైదాపూర్, చిగురుమామిడి, అక్కన్నపేట, తదితర మండలాల్లో గురువారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జన్మదిన వేడుకలను బిజెపి నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రక్తదానం కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం చౌరస్తాలో పెద్ద ఎత్తున భాజపా కార్యకర్తలు తరలివచ్చి కేక్ కట్ చేసి కేంద్రమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్ పేదల ఆశాజ్యోతి అని పేద ప్రజల తరఫున ఆయన చిన్నప్పటి నుండి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఎంతో ఉన్నతమైన శిఖరాన్ని అవరోధించినటువంటి బండి సంజయ్ మనకందరికీ ఆదర్శప్రాయుడని మనసున్న మంచి నేతగా గుర్తింపు పొందాడని ఆయన అన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పోలోజు రాజేందర్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డితో పాటు బిజెపి మండల అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్, బీజేవైఎం సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పెందట భూశంకరాచారి, బిజెపి అక్కన్నపేట మండల కార్యదర్శి కళ్యాణ్ విష్ణు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏర్రోజు సాయి, వారుకోలు నాగరాజు, ఆశడం శ్రీనివాస్, బొడిగే వెంకటేష్, పోలజు వినయ్ తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :