Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : మెట్ పల్లి పట్టణ బీసీ సంఘం ఆధ్వర్యంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ కార్యదర్శి బొమ్మెనశంకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలలో సమగ్ర కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్ను 27% నుండి 42 % వరకు పెంచుతామని హామీ ఇచ్చారని, ఇంతవరకు బీసీ లెక్కలు తీయకపోవడం బాధాకరమని విచారాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే సమగ్ర కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్ పెంచాలని కోరారు. దీనిలో భాగంగా జాతీయ అధ్యక్షులు జాజాల శ్రీనివాస్ గౌడ్ కామారెడ్డి నుంచి కరీంనగర్ వరకు యాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా ఈ నెల 31 తేదీన కరీంనగర్లో జరిగే ముగింపు కార్యక్రమానికి కోరుట్ల నియోజకవర్గం మరియు జగిత్యాల జిల్లా బీసీలు అత్యధికంగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్యదర్శి బొమ్మెన శంకర్, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు నల్ల వెంకటేష్ , భాషనర్సింగారావు, సాదుల్లు అంజయ్య, జిందా ప్రతాప్,గంగోలి సురేష్ తదితరులు పాల్గొన్నారు .
Reporter
Telugu Rekha Media